News March 13, 2025
VJA: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
Similar News
News September 16, 2025
కొమరోలు: సస్పెండ్ అయిన అధ్యాపకులు వీరే.!

కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అధికారులకు తమ సమస్యలపై <<17721439>>లేఖలు<<>> రాశారు. స్పందించిన RDO పద్మజ కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. జువాలజీ అధ్యాపకుడు సుధాకర్ రెడ్డి, కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రభాకర్, కామర్స్ అధ్యాపకుడు హర్షవర్ధన్ రెడ్డి, బాటని అధ్యాపకుడు లోకేశ్లను సస్పెండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కిశోర్ కుమార్ను ఉలవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటేషన్పై పంపారు.
News September 16, 2025
NZB: 8 మందిలో ఆరుగురు పిట్లం వారే

నిజాం రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విమోచనం కల్పించడానికి పిట్లంలోని ఆరుగురు యోధులు అలుపెరగని పోరాటం చేశారు. వారిలో ఉప్పు లక్ష్మయ్య, నాగయ్య, లక్ష్మారెడ్డి, నారాయణ, లక్ష్మయ్య, నారాయణ, కృష్ణారావు, సుబ్బారావు ఉన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 8 మంది ఉండగా వారిలో ఆరుగురు పిట్లం వాసులే కావడం విశేషం. నేటికీ బాన్సువాడ MRO కార్యాలయం ఎదుట ఉన్న శిలాఫలకంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి.
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.