News December 21, 2025
VJA: బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. జనవరి 21 నుంచి పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 2వ ఏడాది రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి నిర్వహిస్తామని..ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29లోపు, రూ.100 ఫైన్తో 30లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.
Similar News
News December 25, 2025
RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్కు షాక్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్కు జైపూర్ పోక్సో కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ సముచితం కాదని పేర్కొంది. క్రికెట్లో సలహాలిస్తానంటూ హోటల్కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు దయాల్పై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే ఆస్కారముంది.
News December 25, 2025
ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.
News December 25, 2025
యలమంచిలి: తండ్రి క్షణికావేశం.. అనాథ అయిన చిన్నారి

క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఆ చిన్నారి అనాథ అయింది. బుధవారం యలమంచిలి పట్టణంలో <<18659799>>మాయ<<>> అనే వివాహితను భర్త రాకేశ్ కిరాతంగా చంపాడు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. తల్లి (మాయ) మృతి.. తండ్రి (రాకేశ్) కటకటాలపాలయ్యాడు. దీంతో అనాథగా మారిన ఆ చిన్నారిని అధికారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులకు అప్పగించారు.


