News September 21, 2025
VJA: భక్తులతో ‘ఫోన్ ఇన్’లో దుర్గగుడి EO ఏమన్నారంటే.?

దసరా నేపథ్యంలో భక్తులతో ‘ఫోన్ ఇన్’లో వచ్చిన పలు అంశాలపై EO శీనా నాయక్ ఏర్పాట్ల గురించి వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు మధ్యాహ్నం 3-4 మధ్య సీతమ్మవారి పాదాల వద్దకు వస్తే ప్రత్యేక వాహనాలలో కొండపైకి తరలించి సులభంగా దర్శనం కల్పిస్తామన్నారు. ఉత్సవాలలో భక్తులకు లిఫ్ట్లు వాడొద్దని పోలీసుల సూచన మేరకు అందరికీ ఘాట్ రోడ్డు మీదుగానే దర్శనం కల్పిస్తామని EO చెప్పారు.
Similar News
News September 21, 2025
HYD: క్యాప్స్ గోల్డ్లో 5వ రోజు ఐటీ సోదాలు

క్యాప్స్ గోల్డ్లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
News September 21, 2025
KNR: ‘ఒక్కేసి పువ్వేసి’.. ఒక్కో రోజు.. తీరొక్క రూపంలో

ఉమ్మడి కరీంనగర్లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మహిళలు ఒక్కోరోజు ఒక్కో రూపంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.
News September 21, 2025
మోదీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఎయిర్పోర్టులో ఆయన్ను కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోదీ కటౌట్ ఎదురుగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు. ఇదే ఎక్కువ’ అని కొందరు ప్రకాశ్ రాజ్పై సెటైర్లు వేస్తున్నారు. ‘మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అసలే మాట్లాడరు’ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.