News November 29, 2025
VJA: భవానీ దీక్షల విరమణకు 7 లక్షల మంది భక్తులు.?

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు డిసెంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభమై, డిసెంబర్ 15 ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో ముగుస్తాయి. ఈ 5 రోజులు సుమారు 7 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, వేచి ఉండే హాళ్లు, పార్కింగ్, ప్రసాదం, అన్నదానం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం

ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్లపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ వారికి సూచించారు.
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
News December 5, 2025
అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.


