News November 29, 2025

VJA: భవానీ దీక్ష విరమణ.. 3 వేల మందితో బందోబస్తు

image

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమాలకు 3 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు, పరిసర ప్రాంతాల పర్యవేక్షణకు 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

Similar News

News December 1, 2025

మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

image

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.

News December 1, 2025

పింఛన్లు పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

image

పింఛన్లు పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్ల సొమ్ములను కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.