News February 19, 2025
VJA: యువతితో అసభ్య ప్రవర్తన.. ఇరువురిపై కేసు

యువతితో అసభ్యంగా ప్రవర్తించిన భార్యాభర్తల పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలో ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ కామేశ్వరరావు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కామేశ్వరరావు భార్య ఉమాదేవికి సమాచారం అందించినా ఆమె కూడా యువతి పై దుర్భాషలాడింది. దీంతో వారిరువురి పై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రకాశ్ తెలిపారు.
Similar News
News November 4, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. 41 రోజులకు జరిపిన ఈ లెక్కింపులో స్వామివారికి రూ.4,22,31,799 ల నగదు, 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండి వచ్చినట్లు ఆలయ ఈఓ NVSN మూర్తి తెలిపారు. ఈ లెక్కింపులో అధికంగా విదేశీ కరెన్సీతో పాటు, రద్దైన పాత కరెన్సీ కూడా వచ్చిందన్నారు.
News November 4, 2025
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.
News November 4, 2025
హిందూజా గ్రూప్ ఛైర్మన్ మృతి

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


