News December 16, 2025
VJA: రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ACB దాడి

విజయవాడ పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ EE కార్యాలయంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేశ్ బాబు లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కాడు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి ధ్రువపత్రం ఇచ్చేందుకు రూ. 15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ACB అధికారులు పట్టుకుని, నగేశ్ బాబు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
Similar News
News December 18, 2025
21 ఏళ్లకే సర్పంచ్ పదవి

TG: పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. సంగారెడ్డి(D) కల్హేర్(M) అలీఖాన్పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా(Left) 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేట(D) అక్కన్నపేట(M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిన్న వయసులోనే సర్పంచులుగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 18, 2025
NZB: BJP సర్పంచ్లు ఎంతమంది గెలిచారంటే!

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.
News December 18, 2025
కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.


