News August 28, 2025

VJA: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP), చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.08579 VSKP- CHZ రైలును OCT 3 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం, నెం.08580 CHZ- VSKP రైలును OCT 4 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

Similar News

News August 28, 2025

MNCL: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకం

image

బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్లతో పాటు 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 10 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించినట్లు పేర్కొన్నారు.

News August 28, 2025

MNCL: వరద ఎఫెక్ట్.. ఆసుపత్రి పేషంట్ల తరలింపు

image

గోదావరి ప్రవాహం గంటగంటకు పెరిగిపోతూ వరద లోతట్టు ప్రాంతాలకు చేరుతుండగా తదితరులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మాతాశిశు ఆసుపత్రి నుంచి పేషంట్లను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. గత సంవత్సరం ఆస్పత్రిలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం ఉదృతంగా సాగుతోంది. రాళ్లవాగు నీరు పోటుకమ్ముతు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది.

News August 28, 2025

సంగారెడ్డి: స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలి

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సెప్టెంబర్ 15లోగా పాఠశాలల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అధికారులు పాఠశాలలను పరిశీలించిన అనంతరం, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను ప్రకటిస్తారని పేర్కొన్నారు.