News September 12, 2025
VJA: ‘రొయ్యల ఎగుమతులతో రూ.60 వేల కోట్లు ఆదాయం’

మన రాష్ట్రంలో పండించే రొయ్యలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏడాదికి రూ. 60 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి వస్తుందని ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరామ్ అన్నారు. అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో రొయ్యల ఎగుమతి ధరలు తగ్గటం వల్ల రొయ్యలు సాగు చేసే రైతులతో పాటు, దేశం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 13, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
✒ ఇష: రాత్రి 7.32 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 13, 2025
‘పెద్దారెడ్డి ఇంటికి కొలతలు.. 2 సెంట్ల ఆక్రమణల గుర్తింపు’

తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు శుక్రవారం సర్వే చేశారు. పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేనట్లు గుర్తించారు. 12 సెంట్లలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. 2 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత చెప్పారు. సర్వే నివేదిక పంచనామాపై సంతకం చేయమని కోరగా పెద్దారెడ్డి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.
News September 13, 2025
నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.