News April 24, 2024
VJA: సతీశ్ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.
Similar News
News September 11, 2025
చల్లపల్లి: పాఠశాల అన్నంలో పురుగులు

చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
News September 10, 2025
కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.
News September 10, 2025
కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్.
☞ విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్.
☞ కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి.
☞ కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్.
☞ కృష్ణా: 11,12 తేదీల్లో కళా ఉత్సవ్ పోటీలు.
☞ కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాపులు.
☞ విజయవాడలో ఈనెల 26న భారీ ఈవెంట్ ప్లాన్.
☞ కృష్ణా: రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల.