News March 20, 2025
VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్, వైద్య శిబిరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News March 21, 2025
ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్లో సత్తాచాటిన 25 మంది

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
News March 21, 2025
SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.
News March 21, 2025
అవసరం లేనిది వదిలేయండి: జిల్లా కలెక్టర్

KMM: మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు ఉపయోగ పడవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడను అ.కలెక్టర్ శ్రీజ, ట్రైన్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్లతో కలిసి ప్రారంభించారు. ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామాన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారుతీసుకొని వెళ్తారన్నారు.