News March 23, 2025
VJA: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 26న MAS-SRC(నం.06077), ఈనెల 24, 28న SRC- MS(నం.06078) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, దువ్వాడ, రాజమండ్రితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News March 26, 2025
అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.
News March 26, 2025
నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.
News March 26, 2025
వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్సైజ్లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.