News January 28, 2025
VKB: అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి: జిల్లా ఎస్పీ

జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ మండలాల డివిజన్ పోలీసులతో అక్రమ రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పీడీఎస్ రైస్, గుట్కా, ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఎప్పటికప్పుడు అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని పోలీస్లకు సూచించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
పల్నాడు: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు.?

టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


