News March 15, 2025

VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..

Similar News

News November 17, 2025

HYD: సౌదీలో ఘటనపై స్పీకర్ దిగ్భ్రాంతి

image

సౌదీలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన పట్ల తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో HYDకు చెందిన హజ్ యాత్రికులు మరణించడం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 17, 2025

HYD: సౌదీలో ఘటనపై స్పీకర్ దిగ్భ్రాంతి

image

సౌదీలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన పట్ల తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో HYDకు చెందిన హజ్ యాత్రికులు మరణించడం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 17, 2025

మృతుదేహాలు వస్తాయా రావా సాయంత్రం తెలుస్తోంది: నాంపల్లి MLA

image

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని, మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడని, ఇక్కడ బాధిత కుటుంబాలను కలిశానని నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ అన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధికుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారని, బాధ్యత కుటుంబాలను ఆదుకుంటామని, మృతుదేహాలు వస్తాయా రావా అనేది సాయంత్రం తెలుస్తుందన్నారు.