News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
Similar News
News December 1, 2025
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
News December 1, 2025
గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.
News December 1, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. హాస్టల్ ప్రాంగణం శుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు.


