News March 12, 2025

VKB: గ్రూప్-1లో సత్తా చాటిన సౌమ్య

image

రెండు రోజుల క్రితం TSPSC ప్రకటించిన గ్రూప్-1 సర్వీస్ ఫలితాలలో వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన కెరెళ్లి వెంకట్ రెడ్డి కూతురు సాస్యరెడ్డి అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచి 462.5 మార్కులు సాధించారు. ఎంతో కష్టపడి తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించిన తండ్రి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Similar News

News November 16, 2025

పాలమూరు: ఈనెల 23 న NMMS పరీక్ష

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఏ.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bsetelangana.gov.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

News November 16, 2025

న్యూస్ అప్‌డేట్స్ @10AM

image

*ఛత్తీస్‌గఢ్‌ సుక్మా(D)లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
*తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
*ఈనెల 19 లేదా DEC 7న TGలో స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ
*మరో ఆపరేషన్ సిందూర్ జరగకూడదని, IND-PAK రిలేషన్స్ మెరుగుపడాలని ఆశిస్తున్నానన్న J&K Ex CM ఫరూక్ అబ్దుల్లా

News November 16, 2025

NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

image

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.