News March 12, 2025
VKB: గ్రూప్-1లో సత్తా చాటిన సౌమ్య

రెండు రోజుల క్రితం TSPSC ప్రకటించిన గ్రూప్-1 సర్వీస్ ఫలితాలలో వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన కెరెళ్లి వెంకట్ రెడ్డి కూతురు సాస్యరెడ్డి అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచి 462.5 మార్కులు సాధించారు. ఎంతో కష్టపడి తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించిన తండ్రి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Similar News
News December 22, 2025
ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

MGNREGA స్థానంలో కేంద్రం కొత్తగా తెచ్చిన VB-G RAM G చట్టంతో రైతులకు ఊరట దక్కనుంది. ఈ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పీక్ అగ్రికల్చర్ సీజన్ (పంటలు వేసే, కోసే)లో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేసే వెసులుబాటు ఉంది. దీనివల్ల రైతులకు కూలీల కొరత నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరగడంతో కూలీల ఆదాయం 25% పెరగనుంది.
News December 22, 2025
బెజవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్ట్

విజయవాడ మాచవరం PS పరిధిలోని ఓ హోటల్లో MDMA డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు పట్టుబడగా, నెల్లూరుకు చెందిన మరో నిందితుడు సినిమా ఫక్కీలో కారుతో సహా పరారవ్వడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు హోటల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పరారైన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు.
News December 22, 2025
వేములవాడ వయా KNR నుంచి అరుణాచలానికి బస్సు

అరుణాచలానికి వేములవాడ నుంచి SL బస్సును ఏర్పాటు చేసినట్లు VMLD DM శ్రీనివాస్ తెలిపారు. DEC 24న VMLD నుంచి మధ్యాహ్నం బయలుదేరి KNR మీదుగా కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనాల అనంతరం DEC 28న KNR మీదుగా రాత్రికి బస్ వేములవాడకు తిరిగి చేరుకుంటుందని చెప్పారు. పెద్దలకు రూ.6,100, పిల్లలకు రూ.4,850ల ఛార్జ్ అని, వివరాలకు డిపో, బస్టాండ్లో సంప్రదించవచ్చు.


