News March 28, 2025
VKB: గ్రేట్.. ఆర్మీకి సెలెక్ట్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లికి చెందిన జంగం యాదయ్య కుమారుడు జంగం గణేష్, మెరుగు శ్రీశైలం కుమారుడు మెరుగు అఖిల్, ఎల్లయ్య కుమారుడు పినేమోని అభిలాశ్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వారివి పేద కుటుంబాలు కాగా పేరెంట్స్ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కష్టాలు చూస్తూ పెరిగిన ముగ్గురు యువకులు సత్తా చాటారు. అగ్నీవీరులుగా ఎంపికయ్యారు.
Similar News
News November 12, 2025
భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.
News November 12, 2025
HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
News November 12, 2025
HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.


