News April 11, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం ✔రేపు పూలే జయంతి వేడుకలు ✔KCR సభకు.. పార్టీ శ్రేణులకు పిలుపు:BRS ✔జిల్లాల్లో జోరుగా వరి కోతలు ✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు ✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం ✔VKB: కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ ✔తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిషన్ నాయక్ ✔VKB: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

Similar News

News October 14, 2025

చేగుంట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు స్వాతి

image

చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.

News October 14, 2025

ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

image

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.

News October 14, 2025

సంగారెడ్డి: NMMSకు నేడే చివరి తేదీ

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.