News March 25, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ✔పంట నష్ట నివేదికను పంపించండి: కలెక్టర్ ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔వికారాబాద్: 26న 148 వాహనాల వేలం ✔పలుచోట్ల భారీ వర్షం ✔ప్రజావాణికి 116 ఫిర్యాదులు: కలెక్టర్ ✔తాండూరు: మాజీ MLA ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు ✔కుల్కచర్ల: ఉపాధి హామీ దిమ్మె కూలీ 4ఏళ్ల చిన్నారి మృతి ✔జడ్పీలో 16 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత.
Similar News
News April 21, 2025
శ్రీకాళహస్తి: జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

శ్రీ కాళహస్తికి చెందిన జైన్ సునీల్ జైన్ ప్రథమ కుమార్తె కాషిష్ జైన్ 17 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెను సత్కరించారు. వచ్చే నెల 3న నాశిక్లో తమ గురువులు మహాసతి, ప్రమోద్ ముని మారా సాహెబ్ ద్వారా ఆమె సన్యాసిగా మారనున్నట్లు తెలిపారు.
News April 21, 2025
కడప: తాగిన మైకంలో గొంతు కోసుకున్న యువకుడు

కడపలో ఇమ్రాన్ మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇమ్రాన్కు తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతను బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
23న పదో తరగతి ఫలితాలు: డీఈవో సలీం

ఈనెల 23న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలు లీప్ యాప్లో పాఠశాల వారీగా కూడా విడుదల చేస్తామని ఆయన వివరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 110 కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో తెలిపారు.