News March 21, 2025

VKB: టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

image

నేటి నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు తెలిపారు. >SHARE IT

Similar News

News October 29, 2025

టుడే హెడ్‌లైన్స్

image

* AP: తీరాన్ని తాకిన మొంథా తుఫాను.. నెల్లూరులో 16.3 సెం.మీ. వర్షపాతం
* తుఫాన్ ప్రభావం.. రేపు ఉదయం వరకు 6 జిల్లాల్లో రాకపోకలు బంద్
* సినీ పరిశ్రమకు స్థలం, సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య: CM రేవంత్
* కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు
* హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత.. అంత్యక్రియలు పూర్తి
* రేవంత్‌ను ప్రజలు క్షమించరు: కవిత
* 8వ పే కమిషన్‌కు కేంద్రం ఆమోదం

News October 29, 2025

రేపే సెమీస్.. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తారా?

image

ICC టోర్నీల్లో అన్‌లక్కీయెస్ట్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రేపు WWC తొలి సెమీస్‌లో ENGతో తలపడనుంది. గెలిస్తే వన్డే WC చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరనుంది. SA మెన్స్&ఉమెన్స్ టీమ్స్ ఎంత పటిష్ఠంగా ఉన్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాయి. ఈసారైనా ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఈనెల 30న రెండో సెమీస్‌లో IND, AUS తలపడనున్నాయి.

News October 29, 2025

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావద్దు: కర్నూలు కలెక్టర్

image

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 -293903కు ఫోన్ చేయాలని సూచించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మరో 3రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.