News February 28, 2025
VKB: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మిస్ చేసుకోకండి

దివ్యాంగులకు సంబంధించిన పరికరాలను అందించేందుకు అంచనా శిబిరాన్ని మార్చి 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. ఏడీఐపీ పథకం కింద బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రై సైకిల్స్, హ్యాండ్ ప్రొపెల్డ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు సూచించడానికి VKBలోని ధర్మ విద్యాలయంలో 3 రోజుల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
HNK: కోతులు, కుక్కల బెడదపై ప్రత్యేక ఫోకస్..

హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదను అరికడితేనే మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్తూ ఉండడంతో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నేరెళ్ల గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణలతో విన్నూత్న ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.
News December 4, 2025
గద్వాల్: రాజవంశీయురాలు డా.సుహాసినిరెడ్డి మృతి

గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లాకు చెందిన రాజవంశీయురాలు డాక్టర్ సుహాసినిరెడ్డి (85) గురువారం తెల్లవారుజామున నిద్రలో మరణించినట్లు ఆమె కుమారుడు లక్ష్మీ చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆమె మరణం పట్ల జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు హైదరాబాద్లో జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


