News March 19, 2025

VKB: పదో తరగతి పరీక్షలు… కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదన్నారు. తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

Similar News

News September 18, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 83,761 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తెలిపారు. ప్రస్తుతం 29,512 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, మరో 259 మెట్రిక్ టన్నులు రానున్నాయని చెప్పారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేస్తూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దన్నారు. పంటలకు తగిన మోతాదులపై గ్రామ స్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.

News September 18, 2025

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.

News September 18, 2025

ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

image

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.