News February 17, 2025
VKB: పన్ను వసూలులో వెనుక ఉన్న మండలాలు ఇవే..!

వికారాబాద్ జిల్లాలో 2024-25లో మర్పల్లి, తాండూర్, పెద్దముల్, కొడంగల్, పూడూర్, యాలాల్, దౌల్తాబాద్, పరిగి, దోమ, మోమిన్ పేట్, బొమ్రాస్ పెట్, కులక్చర్ల, కోటపల్లి మండలాలు పంచాయతీ పన్నువసూళ్ల వెనుకంజలో ఉన్నాయి. పన్ను వసూలులో ప్రధాన కారణం గ్రామాల్లో వివిధ రకాల సర్వేలు నిర్వహించడంతో ఆలస్యమైనట్లు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
Similar News
News October 15, 2025
VJA: ‘సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ఉత్సవాలను వినియోగించుకోండి’

పున్నమిఘాట్లో ఈ నెల 13న ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో ప్రతిరోజూ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని జేసీ ఎస్. ఇలక్కియా తెలిపారు. ఫెస్టివల్ చివరి రోజు బంపర్ డ్రా తీసి విజేతకు స్కూటీ బహూకరిస్తామన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తగ్గిన జీఎస్టీ రేట్లతో, ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్శీశా, అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
నారాయణపేటలో విద్యార్థుల ఆగ్రహం

జిల్లాలోని పలు గ్రామాలకు నిలిపివేసిన బస్ సర్వీసులను పునఃప్రారంభించాలని బుధవారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో సీఐ అలివేలుతో PDSU, SFI నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులను ఆదాయం కోసం ఇతర పట్టణాలకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్ సర్వీసులు లేక, ప్రైవేట్ వాహనాలకు ఛార్జీలు చెల్లించక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని జిల్లా కోశాధికారి మహేశ్ ఫైర్ అయ్యారు.
News October 15, 2025
రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు!

తెనాలిలోని పలు రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 15వ తేదీ వరకు రేషన్ పంపిణీకి అవకాశం ఉన్నా కొన్నిచోట్ల బియ్యం స్టాకు లేదంటూ బోర్డులు పెట్టేస్తుండటంతో ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొందరు డీలర్లు ఈ నెల స్టాక్ తక్కువగా వచ్చిందని చెబుతూ కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యంకి బదులు కిలోకి రూ.10 చొప్పున ఇచ్చి పంపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊర్లోనూ ఈ పరిస్థితి ఉందా?