News March 6, 2025
VKB: పలు మండలాల్లో దంచి కొడుతున్న ఎండలు

మార్చి నెల మొదటి వారంలోని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని పలు మండలాలలో 33-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 10, 2025
KNR: స్ట్రీట్ వెండర్స్కు దన్నుగా PM స్వనిధి స్కీం..!

వీధి వ్యాపారులకు ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో PM స్వనిధి పథకం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) మూడు విడతల్లో 68,632 మంది స్ట్రీట్ వెండర్స్కు రూ. 237.60 కోట్ల రుణాలు అందించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే మొదటి విడతగా రూ.15,000, అవి సక్రమంగా చెల్లిస్తే రెండో విడతలో రూ.25,000, మూడో విడతలో రూ.50,000 చొప్పున మంజూరు చేస్తూ ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తున్నారు.
News December 10, 2025
బాపట్ల: 7 లక్షల ఎకరాలకు సాగునీరు..!

పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం సీఎం అధ్యక్షతన అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ.58,700 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందన్నారు.
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


