News March 6, 2025
VKB: పలు మండలాల్లో దంచి కొడుతున్న ఎండలు

మార్చి నెల మొదటి వారంలోని ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని పలు మండలాలలో 33-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 13, 2025
పల్నాడు: ‘ఓవర్ లోడ్లు అరికట్టేందుకు చర్యలు’

పల్నాడు జిల్లాలో ఓవర్ లోడ్లు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇసుక టిప్పర్లతో పాటు భారీ వాహనాలకు సంబంధించి రూ. 20 వేల వరకు జరిమానాలు ఓవర్ లోడ్కు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేకంగా ఇసుక వాహనాలకు సంబంధించి 35కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. పరిమితికి మించి వెళ్లే ప్రతి వాహనంపై నిఘా ఉంటుందని, నిబంధనలు పాటించాలన్నారు.
News December 13, 2025
గురుకుల స్కూళ్లలో అడ్మిషన్లు.. అప్లై చేసుకోండిలా

TG: ప్రభుత్వ రెసిడెన్షియల్ (గురుకుల) స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5-9 తరగతుల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం TGCET నిర్వహించనుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం <
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.


