News April 8, 2025

VKB: భార్యను పంపకపోవడంతో మామను హత్య చేసిన అల్లుడు

image

దోమ మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుట్టింటికి వెళ్లిన భార్యను పంపకపోవడంతో మామపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లు నిందితుడు ఎడ్ల మల్లేశ్ అంగీకరించాడని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నిద్రిస్తున్న మొగులయ్యను అల్లుడు మోత్కూర్ వాసి మల్లేష్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. భార్యాభర్తల విషయంలో మామ అడ్డు వస్తున్నాడని కక్షతో గొడ్డలితో నరికి చంపినట్లు వివరించారు.

Similar News

News December 10, 2025

అలా చేస్తే కేసులు నమోదు చేస్తాం: తిరుపతి SP

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇప్పిస్తామని జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే కేసులు నమోదు చేస్తామని తిరుపతి SP సుబ్బరాయుడు హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై TTD అధికారులతో ఆయన సమీక్ష చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాల్లో భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. రెగ్యులర్‌గా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయన్నారు.

News December 10, 2025

మొదలైన లారీల బంద్

image

TGలో లారీల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.

News December 10, 2025

పరిటాల సునీతపై ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం

image

ప్రజలను ఉద్దరిస్తారని గెలిపిస్తే, దోపిడీ చేసుకునేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు ఫీలవుతున్నారా? అని MLA పరిటాల సునీతను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ‘భర్త నాలుగు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యే అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేదు. మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగండి’ అని డిమాండ్ చేశారు. రామగిరి MPP ఎన్నికను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించారు.