News April 4, 2025
VKB: మహిళను కాపాడిన పోలీసులు

బొంరాస్ పేట్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపాన నేషనల్ హైవే పక్కన ఓ మహిళ మూర్చ వచ్చి పడిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అంబులెన్స్లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూర్చతో పడిపోవడంతో మహిళకు గాయాలై తీవ్ర రక్తస్రావమైందని స్థానికులు తెలిపారు. మహిళను గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Similar News
News December 1, 2025
శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.
News December 1, 2025
GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సిద్దిపేట: ఇద్దరు ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిపోర్టు పంపించనందున ఇద్దరు ఎంపీఓలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగదేవపూర్ ఎంపీఓ ఖాజా మోహినోద్దీన్, ములుగు ఎంపీఓ కలీంలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రిపోర్టు సరైనదిగా పంపనందున షోకాజ్ జారీ చేసినట్లు తెలిపారు.


