News March 8, 2025
VKB: మహిళలు లక్ష్యాన్ని అలవొకగా ఛేదిస్తారు: జ్వాలా

మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
భూ సేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలి: కలెక్టర్

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, కాలనీల నిర్మాణాలు, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు తదితర పనులకు జిల్లాలో 4,434 ఎకరాల భూమి అవసరం ఉందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో గుర్తించిన భూములకు సంబంధించి ఇంకా సేకరణ చేయాల్సిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.
News October 15, 2025
ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 15, 2025
గుంతకల్లులో గంజాయి తరలిస్తూ పాలకొల్లు వాసి అరెస్ట్

అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ సర్కిల్ వద్ద మంగళవారం ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ ప.గో జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామ వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.