News February 20, 2025

VKB: మహిళలు స్వయం ఉపాధిని అందుకోవాలి: స్పీకర్

image

వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన SC కార్పోరేషన్ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 105 మంది SC మహిళలకు కుట్టు మిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్చ కలిగి ఉండాలని అందుకోసం మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అందుకోవాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధిలో ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ అన్నారు.

Similar News

News December 1, 2025

గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

image

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.

News December 1, 2025

గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

image

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.

News December 1, 2025

అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్

image

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.