News April 13, 2025

VKB: రేపటితో ముగియనున్న గడువు.. మొరాయిస్తున్న సర్వర్

image

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు OBMMS వెబ్సైట్ ఓపెన్ చేయగా సర్వర్ మొరాయిస్తూ కనిపించింది. మరోవైపు రేపటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు ఉండడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారి పెండింగ్లో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Similar News

News November 5, 2025

చేలో కూలీలతో కలిసి కలుపు తీసిన పల్నాడు జిల్లా కలెక్టర్

image

రాజుపాలెం(M) రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.

News November 5, 2025

ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని సాలూరు వంద పడకల ఆసుపత్రి.!

image

కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సాలూరు వంద పడకల ఆసుపత్రి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ప్రారంభంకు నోచుకోలేదు. వైద్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ చూసేందుకు సరిపడా గదులు లేక ఐదుగురు డాక్టర్లు ఒకేచోట ఉండి సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు. ఆసుపత్రి తొందరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News November 5, 2025

కరీంనగర్: అంజనాద్రి క్షేత్రంలో స్వామిపై సూర్యకిరణాలు

image

కరీంనగర్ పరిధి భగత్‌నగర్ గుట్టపై ఉన్న అంజనాద్రి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వయంభు హనుమాన్ విగ్రహంపై నేరుగా పడి భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయ పూజారుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పుణ్యదినాన ఇదే విధంగా సూర్యకాంతులు విగ్రహాన్ని తాకుతాయని తెలిపారు. ఇది దేవస్థాన నిర్మాణ శైలికి, ఆ స్థల పవిత్రతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.