News April 13, 2025

VKB: రేపటితో ముగియనున్న గడువు.. మొరాయిస్తున్న సర్వర్

image

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు OBMMS వెబ్సైట్ ఓపెన్ చేయగా సర్వర్ మొరాయిస్తూ కనిపించింది. మరోవైపు రేపటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు ఉండడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారి పెండింగ్లో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Similar News

News November 22, 2025

MDK: రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ప్రాధాన్యత: ఎంపీ

image

రోడ్లు-రైలు మార్గ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. శనివారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్ ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించాలన్నారు.

News November 22, 2025

మంత్రి ఆనం రేపటి పర్యటనా వివరాలు

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం జిల్లా పరిధిలో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, దేవాలయ ప్రాంగణంలో అనివేటి మండపం నిర్మాణానికి వెంకటగిరి MLAతో కలిసి పాల్గొననున్నారు.

News November 22, 2025

ములుగు: ఎస్పీ కేకన్‌ను కలిసిన ఓఎస్డీ శివమ్

image

ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రామ్నాథ్ కేకన్‌ను, ఓఎస్‌డీ శివమ్ ఉపాధ్యాయ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశమైన ఎస్పీ, జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.