News April 13, 2025

VKB: రేపటితో ముగియనున్న గడువు.. మొరాయిస్తున్న సర్వర్

image

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు OBMMS వెబ్సైట్ ఓపెన్ చేయగా సర్వర్ మొరాయిస్తూ కనిపించింది. మరోవైపు రేపటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు ఉండడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారి పెండింగ్లో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Similar News

News November 17, 2025

అల్లూరు: బొలేరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

image

అల్లూరు(M) సింగపేట వద్ద భవన నిర్మాణ కార్మికులు వెళుతున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు కావలి(M) బట్లదిన్నెకు చెందిన శీనయ్య, ప్రసాద్‌గా గుర్తించారు.

News November 17, 2025

సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.