News April 13, 2025

VKB: రేపటితో ముగియనున్న గడువు.. మొరాయిస్తున్న సర్వర్

image

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు OBMMS వెబ్సైట్ ఓపెన్ చేయగా సర్వర్ మొరాయిస్తూ కనిపించింది. మరోవైపు రేపటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు ఉండడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారి పెండింగ్లో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, దరఖాస్తు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Similar News

News January 16, 2026

ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

image

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.

News January 16, 2026

వార్డుల రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రిజర్వేషన్ పట్టికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. గణాంకాలు, రొటేషన్ పద్ధతి, గత డేటాను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 16, 2026

ప.గో: సుడి తిరిగింది.. కారు, రూ.20 లక్షల క్యాష్ ప్రైజ్!

image

ఉంగుటూరు(M) నారాయణపురం దండుదారిపుంత బరిలో నిడమర్రు మండలం పత్తేపురానికి చెందిన పొత్తూరి నరసింహరాజుని అదృష్టం వరించింది. బరిలో నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.25 లక్షల విలువైన కారును గెలుచుకోగా, పందేల్లో మరో రూ.20 లక్షల గెలుపొందారు. మొత్తంగా రూ.45 లక్షల సొంతం చేసుకున్న విజేతకు ఎమ్మెల్యే ధర్మరాజు కారును అందజేశారు.