News April 10, 2025
VKB: రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు

సన్న బియ్యం పంపిణీతో వికారాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. జిల్లాలో 2,48,122 రేషన్ కార్డులు ఉండగా 580 రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. గతంలో పంపణీ చేసిన దొడ్డు బియ్యం తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం నుంచి ఎప్పుడు చూసినా రేషన్ షాపులు ప్రజలతో రద్దీగా ఉంటున్నాయి. ఈ బియ్యం బాగున్నాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 16, 2025
రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.
News October 16, 2025
UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.
News October 16, 2025
నేటి నుండే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5వ జాతీయ స్థాయి అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో క్రీడా పోటీల ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు 135 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచులు పాల్గొంటారు.