News December 16, 2024
VKB: వీర సైనికులకు స్పీకర్ నివాళి..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734326570939_15795120-normal-WIFI.webp)
విజయ్ దివస్ సందర్భంగా 1971 ఇండో పాక్ యుద్ధంలో ప్రాణత్యాగాలు చేసి దేశానికి గెలుపునిచ్చిన వీర సైనికుల స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లుగా తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి మించిన సేవ ప్రపంచంలో మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738736306994_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 5, 2025
హైదరాబాద్లో ఎవరి బలం ఎంత?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738728915892_705-normal-WIFI.webp)
HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.
News February 5, 2025
ఘట్కేసర్లో రైల్వే ట్రాక్పై సూసైడ్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738722785157_705-normal-WIFI.webp)
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.