News April 6, 2025

VKB: షాపింగ్ మాల్‌పై మహిళా సంఘ నేతల ఫిర్యాదు

image

మహిళలకు రూ.9 చీర ఇస్తామని మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు వాళ్లకు కల్పించకుండా మహిళలను అవమానపరచారన్నారు. పట్టణ కేంద్రంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని అన్నారు.

Similar News

News September 13, 2025

MNCL: ఈనెల 22న PLR బోనస్‌పై జేబీసీసీఐ సమావేశం

image

బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా అందించే పనితీరు ఆధారిత రివార్డు (PLR) చెల్లింపుపై ఈనెల 22న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ బెనర్జీ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.

News September 13, 2025

వరంగల్ మీదుగా వెళ్లే వందే భారత్ రాకపోకల్లో స్వల్ప మార్పులు

image

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల్లో స్వల్ప మార్పులు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య వరంగల్ మీదుగా ప్రస్తుతం గురువారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తున్న ఈ రైళ్లు డిసెంబర్ 5 నుంచి గురువారానికి బదులుగా సోమవారం ట్రిప్పులను రద్దు చేశారు. ఇకనుంచి సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

News September 13, 2025

మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

image

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.