News December 19, 2024
VKB: సన్నధాన్యం అమ్మినవారు 699 మంది మాత్రమే..!
VKB జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 699 మంది రైతులు మాత్రమే సన్న వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల వద్ద విక్రయించినట్లు అధికారులు తెలిపారు. సన్న వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, బయట మార్కెట్లలో ప్రస్తుత రేటు ఎక్కువగా ఉండటంతో అటువైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 23, 2025
HYD ఎయిర్పోర్ట్లో సందర్శకులకు నో ఎంట్రీ
గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT
News January 23, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
News January 23, 2025
ఓయూలో పీజీ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఓయూలో దూరవిద్య పరిధిలోని వివిధ పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. M Com, MA, Msc తదితర కోర్సుల మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.