News April 4, 2025

VKB: సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

వికారాబాద్ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి వివిధ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

Similar News

News October 26, 2025

MBNR: రేపు నూతన మద్యం షాపులకు లక్కీ డ్రా

image

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలో 2025–27 మద్యం పాలసీకి సంబంధించిన A4 మద్యం షాపుల లైసెన్స్‌దారుల ఎంపిక సోమవారం లాటరీ పద్ధతిలో జరుగుతుంది. మహబూబ్‌నగర్ కలెక్టర్ ఆఫీస్‌లోని ప్రజావాణి హాల్‌లో ఈ డ్రా నిర్వహించనున్నట్లు నారాయణపేట ఎక్సైజ్ అధికారి అనంతయ్య తెలిపారు. మొత్తం 90 మద్యం షాపుల కోసం మొత్తం 2,487 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉదయం 9 లోపు దరఖాస్తుదారులు, సంబంధిత రసీదు, ప్రవేశ పత్రం తీసుకురావాలన్నారు.

News October 26, 2025

రేపు ఎస్పీ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో 27న నిర్వహించవలసిన PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.

News October 26, 2025

దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

image

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.