News March 15, 2025

VKB: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 15, 2025

‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

image

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

News March 15, 2025

సంగారెడ్డి: ‘పరీక్షకు 239 మంది విద్యార్థులు గైర్హాజరు’

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.13,987 మంది విద్యార్థులకు గాను 13,748 మంది విద్యార్థులు హాజరయ్యారని, 239 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 15, 2025

భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

image

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.

error: Content is protected !!