News March 15, 2025

VKB: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

Similar News

News December 13, 2025

దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

image

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్‌లో 2443, ఛత్తీస్‌గఢ్‌లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

News December 13, 2025

భద్రాద్రి జిల్లాలో రెండో విడతలో ఏకగ్రీవమైన జీపీలు..

image

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో రేపు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వివరాలిలా.. అన్నపురెడ్డిపల్లి(M) గుంపెన – ధారబోయిన నరసింహ, ఊటుపల్లి – వాడే వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట(M) మద్దికొండ- తాటి రామకృష్ణ, రామన్నగూడెం- మడకం నాగేశ్వరరావు, ములకలపల్లి(M) పొగళ్లపల్లి – మడకం రవి, చండ్రుగొండ(M) బెండలపాడు-బొర్రా లలిత, మంగయ్య బంజర- మాలోత్ గోపికృష్ణ.

News December 13, 2025

15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

image

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.