News September 20, 2025

VKB: ఆర్టీఐ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి: చంద్రశేఖర్ రెడ్డి

image

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005ను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో పీఐఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ కింద వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

Similar News

News September 20, 2025

HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

image

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News September 20, 2025

సంగారెడ్డి: జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. భూ సేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూముల అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.

News September 20, 2025

HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

image

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.