News December 16, 2025
VKB: ఓట్ల కోసం వస్తూ యువకుడి మృతి

ఓట్ల కోసం వస్తూ ప్రమాదంలో యువకుడు మరణించిన ఘటన కుల్కచర్ల మండలంలోని బండమీది తండాలో జరగింది. పోలీసుల ప్రకారం.. HYD శేర్లింగంపల్లి నుంచి ఓట్లు వేసేందుకు సొంత గ్రామానికి వస్తుండగా బైకును టిప్పర్ ఢీకొని మరణించాడు. ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామంలో యువకుడు మరణించడంతో విషాదచాయలు అమ్ముకున్నాయి. ఓట్లు వేసేందుకు తాండా ప్రజలు ఆసక్తి చూపించడం లేదని ప్రజలు పేర్కోటున్నారు.
Similar News
News December 18, 2025
చంద్రన్న మార్కాపురం జిల్లా.. ఫ్లెక్సీ వైరల్.!

ప్రకాశం నుంచి విడిపోతున్న మార్కాపురం జిల్లా పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. MLA కందుల నారాయణరెడ్డి జిల్లా ప్రకటన తర్వాత చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలన్నారు. దీనిని పలు సంఘాలు వ్యతిరేకించి, నల్లమల జిల్లా, కాటమరాజు జిల్లా పేర్లను ప్రతిపాదించాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రన్న మార్కాపురం జిల్లా అంటూ ఫ్లెక్సీలో ఉండడం గమనార్హం.
News December 18, 2025
కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
News December 18, 2025
బాపట్ల: పిచ్చికుక్క దాడిలో 8 మంది చిన్నారులకు గాయాలు

రేపల్లెలోని ఎనిమిదో వార్డులో గురువారం దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డుపై నుంచున్న 8 మంది చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు వ్యాక్సిన్తో పాటు అదనంగా యాంటీ రేబిస్ సీరం (ఇమ్యునో గ్లోబిలిన్) ఇంజక్షన్ ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.


