News February 23, 2025
VKB: క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న కబడ్డీ ప్లేయర్లు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కోరిక మేరకు నిర్వాహకులు స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇండియా, పాక్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందడానికి ఈ ఏర్పాటే నిదర్శనం. ఆదివారం సాయంత్రం కబడ్డీ ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
Similar News
News November 8, 2025
మహానంది: కోడిపిల్లకు రెండు తలలు

ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం జన్మించగా శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.
News November 8, 2025
రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో మరమ్మతులు

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.రెండు కోట్ల అంచనాలతో తయారుచేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. కొత్తపేట గ్రామంలో చప్టాను రూ.12 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు చేయవచ్చన్నారు. శాశ్వత పరిష్కారానికి రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు.
News November 8, 2025
యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.


