News March 12, 2025
VKB: గ్రూప్-1లో సత్తా చాటిన సౌమ్య

రెండు రోజుల క్రితం TSPSC ప్రకటించిన గ్రూప్-1 సర్వీస్ ఫలితాలలో వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన కెరెళ్లి వెంకట్ రెడ్డి కూతురు సాస్యరెడ్డి అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచి 462.5 మార్కులు సాధించారు. ఎంతో కష్టపడి తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించిన తండ్రి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Similar News
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News April 14, 2026
కొవిడ్ వ్యాక్సిన్తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.
News April 14, 2026
పాలకోడేరు: ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


