News March 27, 2025
VKB జిల్లాలో నేటి TOP NEWS..!

❤ VKB:బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బసవరాజ్ పటేల్ ❤VKB: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు:అదనపు కలెక్టర్ ❤రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన తాండూరు ఎమ్మెల్యే ❤మెరుగైన వైద్యం అందించాలి: పరిగి మాజీ ఎమ్మెల్యే ❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ❤పరిగి:శ్రీ సత్య హరిచంద్ర వీధి నాటక ప్రదర్శన ❤మల్లికార్జున్ ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే.
Similar News
News October 28, 2025
పల్నాడు: ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారులకు మరో అవకాశం

పల్నాడు జిల్లాలో వివిధ కారణాల వల్ల 16,238 మంది పట్టాదార్ రైతులకు ఆధార్ సీడింగ్ కాలేదని అధికారులు గుర్తించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంపికై, ఆధార్ కారణంగా నగదు పడని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ లబ్ధిదారులకు మీ సేవ కేంద్రాలలో ఆధార్ సీడింగ్కు సర్వీస్ ఛార్జి మినహాయింపు ఇస్తూ సీసీఎల్ఏ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
News October 28, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. రేపే లాస్ట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. SHARE IT.
News October 28, 2025
అనకాపల్లి: పెట్టుబడి పేరుతో రూ.13.62 లక్షలు కొట్టేసింది

ఓ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు ఆదాయం వస్తుందని అనకాపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ రమణబాబును మోసం చేసి రూ.13.62 లక్షలు కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 17న రమణబాబుకు ఓ మహిళ ఫోన్ చేసి తాను సూచించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు.రమణబాబు ఆమె ఖాతాకు డిజిటల్ ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించాడు.


