News April 5, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS

✓వికారాబాద్ జిల్లా సీపీఓగా జి.వెంకటేశ్వర్లు ✓ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ✓ పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ✓ గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం ✓ IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సైలు ✓ VKB: మాజీ సీఎంKCRతో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ✓VKB: CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ✓ VKB:సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్
Similar News
News February 3, 2026
ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం మాయం

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో ఉన్న దీన్ని దుండగులు కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2021లో భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 426 కిలోల బరువున్న బాపూజీ స్టాచ్యూను అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు.
News February 3, 2026
మేడారం జాతరలో తప్పిపోయిన మహిళ

తాడ్వాయి మండలంలోని నర్సింగాపురంలో మేడారం జాతర నుంచి తప్పిపోయిన ఓ మహిళ తిరుగుతుందని స్థానికులు తెలిపారు. తన అక్కకు ఫోన్ చేయాలని, ఆమె అక్క పేరు రజిత అని మాత్రమే చెబుతుండగా ఫోన్ నంబర్ తెలియజేయడం లేదన్నారు. ప్రస్తుతం తాడ్వాయి మండల కేంద్రం పరిసరాల్లో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ఆమె వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు స్థానికులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
News February 3, 2026
క్యాన్సర్పై అవగాహన ప్రాణాధారం: జడ్జి సౌజన్య

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


