News March 27, 2025
VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.
Similar News
News March 30, 2025
APPLY: నెలకు రూ.5,000.. రేపే చివరి తేదీ

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన PM ఇంటర్న్షిప్ పథకం దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దాదాపు 350 కంపెనీల్లో లక్షన్నర మందికి ఇంటర్న్షిప్ అవకాశాలను కేంద్రం కల్పించనుంది. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ(6 నెలలు క్లాస్రూమ్+6 నెలలు ఫీల్డ్ ట్రైనింగ్) ఉంటుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ₹6Kతోపాటు ప్రతినెలా ₹5K చొప్పున ఇవ్వనుంది.
వెబ్సైట్: https://pminternship.mca.gov.in/
News March 30, 2025
BREAKING: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఆదివారం డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆళ్లగడ్డ అర్బన్ పీఎస్ సీఐగా ఉన్న ఎస్.చిరంజీవిని కర్నూలు ఫ్యాక్షన్ జోన్ సీఐగా బదిలీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐగా ఉన్న ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ UPS సీఐగా, నంద్యాల VRలో ఉన్న ఎం.గంగిరెడ్డి నంద్యాల సీసీఎస్-2 సీఐగా నియమితులయ్యారు. కర్నూలు VRలో ఉన్న వీ.శ్రీహరి మైదుకూరు UPSకు బదిలీ అయ్యారు.
News March 30, 2025
పంచెకట్టులో కడప కలెక్టర్

కడప కలెక్టరేట్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఏడాదిలో అందరికి శుభం కలగాలని ప్రార్థించారు. పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.