News October 14, 2025

VKB: ‘పిల్లలు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలి’

image

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో మంగళవారం జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు, ఆరోగ్యం, విద్య గురించి వివరాలు తెలుసుకున్నారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిన ఆర్థిక సహాయం గురించి కూడా ఆరాతీశారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు ఎంతో అవసరమని తెలిపారు.

Similar News

News October 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

News October 15, 2025

భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

image

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.

News October 15, 2025

సంగారెడ్డి: ఉద్యోగులు సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రైసింగ్- 2047లో ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. https://www.telangana.gov.in/telanganarising/ లింకు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చని చెప్పారు. ఉద్యోగులతో పాటు పౌరులు కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.