News March 17, 2025

VKB: పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని సైబర్ నేరగాళ్ల బురిడీ

image

పెన్సిల్స్ లోడ్ పంపిస్తామని ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లికి చెందిన యూనుస్ భార్య స్నాప్ చాట్ చూస్తున్న క్రమంలో ఓ లింకును ఓపెన్ చేశారు. పెన్సిల్ లోడ్ మీ వద్దకు వస్తుందని.. అవి ప్యాక్ చేస్తే నెలకు రూ.30 వేల వేతనం ఇస్తామంటూ నమ్మబలికారు. ఐడీ కార్డు ఇతరత్రా వాటికోసం రూ.13వేలు చెల్లించారు. కాగా, మోసపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News September 19, 2025

పులివెందులకు కూడా మేమే నీళ్లిచ్చాం: CBN

image

ఏపీ, తెలంగాణలో మెజార్టీ ప్రాజెక్టులు తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇప్పుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామన్నారు. కుప్పానికి కృష్ణా జలాలు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని సీఎం వెల్లడించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

News September 19, 2025

ఉత్తమ పనికి రివార్డులు.. తప్పిదాలకు చర్యలు: KMR SP

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం పోలీసు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇటీవల వరదల సమయంలో సిబ్బంది చేసిన కృషిని ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారని గుర్తు చేశారు. ఉత్తమ పని తీరుకు రివార్డులు, తప్పులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోంగార్డులకు రైన్‌కోట్లు, ఉలెన్ జెర్సీలను SP అందజేశారు.

News September 19, 2025

బల్లికురవ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఒకరి మృతి

image

బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. ఎస్సై నాగరాజు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా చునార్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్(30) గ్రానైట్ ముడి రాయిని ఎత్తే సమయంలో క్రేన్ గొలుసు తెగి మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.