News August 27, 2025

VKB: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Similar News

News August 27, 2025

ఈనెల 29న మంత్రుల సమావేశం రద్దు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈనెల 29న కర్నూలులో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. మంత్రి డా.నిమ్మల రామానాయుడు, మంత్రి సత్య కుమార్ యాదవ్‌ల సమావేశం రద్దు అయిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు గమనించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News August 27, 2025

HYD: రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచండి: DRM

image

సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని DRM గోపాలకృష్ణన్ అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. స్టీల్ వర్క్ దాదాపుగా చివరి స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే వెయిటింగ్ అలా అందుబాటులోకి రాగా, త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వివరించారు.

News August 27, 2025

విజయవాడ: వర్షాలపై VMC అప్రమత్తం

image

భారీ వర్షాల నేపథ్యంలో VMC అప్రమత్తమైంది. నగరంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి 43 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.