News April 25, 2025
VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.
Similar News
News December 23, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR, KTRకు <<18647212>>నోటీసులు<<>> ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేశారు. SIB వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్లు, లీడర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటారా? దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే. కేసును సాగదీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News December 23, 2025
3 నెలల్లో ₹75వేల కోట్ల ఆదాయ లక్ష్యం

TG: రానున్న 3 నెలల్లో సొంత పన్నుల ఆదాయం కింద ₹75వేల కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FY25-26లో ₹1.75 లక్షలCR లక్ష్యం కాగా ఇప్పటివరకు ₹లక్షCR వరకు సమకూరింది. 2026 MAR చివరి నాటికి తక్కిన మొత్తాన్ని సాధించేలా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా శాఖలపై దృష్టి సారించింది. గతేడాది టార్గెట్లో 82% మాత్రమే సాధించింది. ఈ ఏడాది 95%కి పైగా సాధించాలని నిర్ణయించింది.
News December 23, 2025
రేపట్నుంచి విజయ్ హజారే ట్రోఫీ.. బరిలోకి దిగ్గజాలు!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా కీలక ప్లేయర్లు పలు మ్యాచ్లు ఆడనున్నారు. అయితే కళ్లన్నీ దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ(ముంబై), విరాట్ కోహ్లీ(ఢిల్లీ)పైనే ఉన్నాయి. BCCI <<18575287>>ఆదేశాల<<>> నేపథ్యంలో వీరిద్దరూ కనీసం 2 మ్యాచుల్లో బరిలోకి దిగనున్నారు. T20 WC జట్టులో చోటు కోల్పోయిన గిల్తోపాటు రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ కూడా ఆడనున్నారు.


