News September 13, 2025
VKB: రాజీమార్గంతో మేలు: జడ్జి

రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు తగ్గిపోయి సమయం వృథా కాకుండా ఆర్థికంగా చితికి పోకుండా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు న్యాయం పొందాలని తెలిపారు.
Similar News
News September 13, 2025
పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందారు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు పల్నాడు ఎస్పీగా పనిచేసిన కంచి శ్రీనివాసరావుకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
News September 13, 2025
రాజధానిపై సజ్జల కామెంట్స్ వైరల్.. మీరేమంటారు?

AP: తాము గెలిస్తే గుంటూరు-విజయవాడ మధ్య <<17688305>>రాజధాని<<>> ఏర్పాటు చేస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నిసార్లు మాట మారుస్తారని TDP శ్రేణులు విమర్శిస్తున్నాయి. 2014లో జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, 2019లో గెలిచాక 3 రాజధానులు అన్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారని, ఇది దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. మరి రాజధానిపై సజ్జల వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 13, 2025
గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.