News March 17, 2025
VKB: 100% ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యం: DPO జయసుధ

వికారాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన 9.7 కోట్ల రూపాయల ఆస్తిపన్నును 100% వసూలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా పన్నువసూలు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. మార్చ్ 31 నాటికి 100% పన్నులు వసూలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News February 26, 2026
నల్గొండ: రూ.43 కోట్ల ధాన్యం కుంభకోణం.. దంపతుల అరెస్ట్

ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ఖజానాకు రూ.43 కోట్లు గండికొట్టిన కిలాడీల గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. కస్టమ్ మిల్లింగ్ పేరుతో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కందుకూరి మహేందర్ దంపతులను అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News February 26, 2026
మా ఫోకస్ టీమ్ఇండియా కాదు: జింబాబ్వే స్టార్ ఇవాన్స్

T20 WC S-8లో భాగంగా భారత్తో నేడు జరగనున్న కీలక పోరుపై జింబాబ్వే స్టార్ బ్రాడ్ ఇవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీమ్ఇండియాపై కాకుండా తమ సొంత ప్రణాళికపైనే ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్లో ఒకటని.. అందుకే గ్రౌండ్లో 100% శ్రమించి ఆడతామని తెలిపారు. లెఫ్ట్ హ్యాండర్లతో నిండిన ఇండియా టాప్ ఆర్డర్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
News February 26, 2026
కామారెడ్డి: ఓడిన వారికి అప్పులే!

ఎన్నికల జాతర ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమకున్న స్థలాలు తాకట్టు పెట్టారు. నమ్మబలికిన ఓటర్ల మాటలు నమ్మి లక్షల రూపాయలు గుమ్మరించారు. గెలుపుపై ధీమా కల్పించిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అభ్యర్థులను గాలికి వదిలేసి గెలిచిన వారి చెంతకు చేరుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. డబ్బుతో ఓట్లను కొనే వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.


