News February 22, 2025
VKB: 100 ఏళ్ల నుంచి ఎండిపోని ఊట

వంద సంవత్సరాల నుంచి జాంబాపూర్, కోటం గుట్ట తండాల మధ్యలో ఊట ఎండిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు 85 సంవత్సరాలుగా ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారని అంటున్నారు. బోర్లు, మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ఊట నీరు తాగడం మానేశారని తెలిపారు. ఇప్పుడు పశువుల దాహార్తిని ఈ ఊట తీరుస్తుందంటున్నారు.
Similar News
News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్కు పంపిస్తామన్నారు.
News November 19, 2025
యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

యువత పెళ్లి కంటే కెరీర్పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.


